ఎగ్గ్ కర్రీ చేయలేదని స్నేహితుడి హత్య

by  |
ఎగ్గ్ కర్రీ చేయలేదని స్నేహితుడి హత్య
X

దిశ, వెబ్‎డెస్క్: భోజనానికి పిలిచి ఎగ్గ్ కర్రీ చేయలేదని స్నేహితుడు ప్రాణాలను తీశాడు ఓ కిరాతకుడు. ఈ ఘటన శనివారం మహారాష్ట్రలోని నాగ్‎పూర్‎లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని మంకాపూర్‎కు చెందిన బనార్సీ అనే వ్యక్తి శనివారం రాత్రి తన ఫ్రెండ్ గౌరవ్ గైక్వాడ్‎ను భోజనానికి పిలిచాడు. ఇద్దరూ కలిసి అర్ధరాత్రి వరకు మద్యం సేవించారు. అనంతరం తినే సమయానికి కోడిగుడ్డు వండలేదని బనార్సీ చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఈ క్రమంలో గౌరవ్ ఇనుపరాడ్డుతో బనార్సీ తలపై కొట్టాడు. దీంతో బన్సారీ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు హంతకుడు గౌరవ్‎ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.



Next Story

Most Viewed