- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మరో హత్యాయత్నం జరిగింది. ఇప్పటికే వైసీపీ నేత మోకా భాస్కర్ రావు హత్య కేసు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద సంచలనం సృష్టించింది. తాజాగా బందరులోని మాచవరం ప్రాంతంలో మరో హత్యాయత్నం జరిగింది. కారు ఫైనాన్స్ డబ్బులు అడిగేందుకు వెళ్లిన వరుణ్ మారుతి ఉద్యోగిపై కత్తితో దాడి చేశారు. వివరాల్లోకివెళితే.. పెడన దక్షిణ తెలుగుపాలెం 19వ వార్డుకి చెందిన గుడిసె రాకేష్ అనే వ్యక్తి కారు ఫైనాన్స్ డబ్బుల వసూలు చేసేందుకు వెళ్లాడు. అప్పటికే పన్నాగం పన్నిన దుండగులు అతడిని మాచవరంలోని రోడ్డు పక్కన ఉండే దుకాణాల వద్ద కత్తితో పొడిచి పక్కనే ఉన్న డ్రైనేజీలో పడేసి పరారయ్యారు. మచిలీపట్నం చిలకలపూడికి చెందిన జ్యువెలరీ షాపు యజమాని నాగేశ్వర రావు, అతని కుమారుడు ఇద్దరు కలిసి హత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉండగా వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనలో గాయపడ్డ గుడిసె రాజేష్ను మచిలీపట్నం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, కత్తి పోట్లతో గాయపడ్డ రాజేష్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.