- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేఏ పాల్లా మారిపోయాడని, జోకర్లా మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం చండూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజగోపాల్రెడ్డికి పిచ్చి ముదిరిందని, ఏం మాట్లాడుతుండో ఆయనకే అర్థం కాట్లేదన్నారు. మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఖాళీ అవుతుంటే.. రాజగోపాల్ రెడ్డికి దిమ్మతిరుగుతోందని ఆయన అన్నారు. రాజగోపాల్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు మాత్రం గడప దాటట్లేదంటూ మండిపడ్డారు. వెల్మకన్నే ఫీడర్ ఛానెల్ను పూర్తి చేస్తామని హామీనిచ్చి మర్చిపోయాడన్నారు. మంత్రి జగదీష్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబడ్దార్.. అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. మునుగోడులో తన అనుచరులను కాపాడుకోలేని రాజగోపాల్ రెడ్డి సూర్యాపేటకి పోయి రాజకీయాలు చేస్తాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మునుగోడు ప్రజలు రాజగోపాల్ రెడ్డిని దొంగలాగా చూస్తున్నారని, అసత్యాల ఎమ్మెల్యేగా రాజగోపాల్ రెడ్డి చరిత్రకెక్కారన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మునుగోడును అన్నిరంగాల్లో అభివృద్ధి చేశామని కూసుకుంట్ల పేర్కొన్నారు.