అయిన వాళ్లు వదిలేస్తే.. ఫ్రంట్ లైన్ వర్కర్లు ముందుకొచ్చారు

by  |
అయిన వాళ్లు వదిలేస్తే.. ఫ్రంట్ లైన్ వర్కర్లు ముందుకొచ్చారు
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా రాకముందు ఫ్రంట్‌లైన్ వర్కర్ల గురించి పెద్దగా న్యూస్ ఉండేది కాదు. కానీ, కొవిడ్ పుణ్యమా అని వారు అందిస్తున్న సేవలకు ఎట్టకేలకు గుర్తింపు దక్కింది. అంతేకాకుండా ప్రభుత్వాలు వారి సేవలను కీర్తించసాగాయి. అంతే స్థాయిలో కొవిడ్ వర్కర్లు సైతం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రాణాంతక వైరస్ ను ఎదుర్కొంటూనే తమ విధులను నిర్వర్తిస్తున్నారు.

తాజాగా కొవిడ్‌తో మృతి చెందిన శవాన్ని తీసుకెళ్లడానికి బంధువులు ఎవరూ ముందుకు రాకపోతే, స్వయంగా డెడ్‌బాడీని మోసి చివరకు అంత్యక్రియలు నిర్వహించారు పారిశుధ్య కార్మికులు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా అక్కుపల్లి శ్మశాన వాటికలో బుధవారం వెలుగుచూసింది. మాయదారి కరోనా నా అనుకున్న వాళ్లను దూరం చేస్తుంటే.. ఫ్రంట్ లైన్ వర్కర్లు తమ దాతృత్వాన్ని చాటుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.



Next Story