విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్‌కు ఉత్తర్‌ప్రదేశ్

by  |
విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్‌కు ఉత్తర్‌ప్రదేశ్
X

దిశ, స్పోర్ట్స్ : బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే దేశీయ వన్డే టోర్నీ ఫైనల్‌కు ఉత్తర్‌ప్రదేశ్ జట్టు చేరుకున్నది. గురువారం ఢిల్లీలో గుజరాత్‌తో జరిగిన తొలి సెమీస్‌లో యూపీ జట్టు అద్భుత విజయాన్ని సాధించి విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్‌కు చేరుకున్నది. ఈ టోర్నీ ప్రారంభించిన తర్వాత 2005/06లో ఉత్తర్‌ప్రదేశ్ జట్టు ఫైనల్‌కు చేరుకున్నది. ఆ తర్వాత తిరగి ఫైనల్ చేరుకోవడం ఇదే తొలిసారి. సెమీస్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు టాపార్డర్ పూర్తిగా విఫలం అయ్యింది. కానీ హెట్ పటేల్ (60), చావ్లా (32) కాస్త రాణించడంతో ఈ మాత్రమైనా స్కోర్ చేసింది. కానీ యూపీ బౌలర్లు గుజరాత్ బ్యాటింగ్ లైనప్‌ను పడగొట్టారు. దీంతో గుజరాత్ జట్టు 48.1 ఓవర్లలోనే 184 పరుగులకు ఆలౌట్ అయ్యింది. యశ్ దయాల్ 3 వికెట్లు తీశాడు.

ఇక 185 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన యూపీ 42.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయం అందుకున్నది. అక్షదీప్ నాథ్ 71 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టన్ కరణ్ శర్మ(38) అతడికి తోడుగా ఉన్నాడు. అక్షదీప్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.ఈ ఆదివారం జరగనున్న ఫైనల్‌లో యూపీతో ముంబయి జట్టు తలపడనున్నది.

Next Story

Most Viewed