ముంబై – ఢిల్లీ మ్యాచ్ ఫిక్సయ్యిందా?

by  |
ముంబై – ఢిల్లీ మ్యాచ్ ఫిక్సయ్యిందా?
X

దిశ, స్పోర్ట్స్ :

ఐపీఎల్ 13లో భాగంగా ఆదివారం రాత్రి ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ ఫిక్సయ్యిందా? ఢిల్లీ ఎంత స్కోర్ చేస్తుందో ముంబయి జట్టుకు ముందే తెలుసా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తున్నది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఢిల్లీ జట్టు బ్యాటింగ్ ప్రారంభించిన కొద్ది సేపటికే ముంబయి చేసిన ట్వీట్‌పై పలు అనుమానాలు నెలకొన్నాయి.

‘బౌల్ట్‌తో కలసి ప్యాటిన్సన్ కొత్త బంతిని పంచుకోనున్నాడు. ఢిల్లీ – 163/5 (19.5 ఓవర్లు)’ అని ట్వీట్‌లో పేర్కొంది. ఆ ట్వీట్‌లో పేర్కొన్నట్లుగానే ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. దీంతో ఈ మ్యాచ్ ముందుగానే ఫిక్స్ అయ్యిందని.. అందుకు ఆ ట్వీట్ సాక్షమంటూ నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ముంబయి జట్టుకు తెలియకపోతే ఏ ట్వీట్ ఎందుకు చేసింది? సరదాకే చేస్తే మరి తర్వాత ఆ ట్వీట్ ఎందుకు తొలగించిందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీనిపై విచారణ జరపాలని కూడా కొంత మంది డిమాండ్ చేస్తున్నారు. కాగా, ముంబయి జట్టు యాజమాన్యం ఈ ట్వీట్‌పై ఇంకా స్పందించలేదు.



Next Story

Most Viewed