యువతకు కేంద్రం గుడ్ న్యూస్.. ఆన్ లైన్‌ ద్వారా రూ.10 లక్షల లోన్

by  |
యువతకు కేంద్రం గుడ్ న్యూస్.. ఆన్ లైన్‌ ద్వారా రూ.10 లక్షల లోన్
X
దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం వృత్తి నైపుణ్యం పెంచడానికి యువత కోసం స్కిల్‌ ఇం‌డియా పేరుతో వివిధ సంస్థలు ఏర్పాటు చేసి వివిధ వృత్తుల్లో ఉచిత శిక్షణ ఇప్పిస్తున్న విషయం తెలిసిందే. దీంతో పాటుగా పలు వ్యాపారాలు నిర్వహించుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ముద్ర యోజన కింద మూడు రకాలుగా రుణాలు అందిస్తుంది. దీన్ని సులభతరం చేస్తూ మరో నిర్ణయం తీసుకుంది. దేశంలో స్వయం ఉపాధిని పెంపొందించడానికి ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన పథకాల్లో ప్రధాన మంత్రి ముద్ర యోజన ఒకటి. ఈ స్కీమ్‌లో మొదటి దశలో ఎందరికో ఆసరాగా నిలిచింది. ఇప్పుడు మరో దశ ముద్ర పథకం ప్రారంభమైంది. ఈ స్కీమ్‌ కింద బ్యాంకులు రుణాలు పంపిణీ చేస్తున్నాయి. రుణాలు పొందడానికి అవకాశం కోసం చూస్తున్న వారికి మంచి అవకాశం.
ముద్ర ద్వారా అర్హత కలిగిన వారు సులభంగానే రుణం పొందే అవకాశం ఉంటుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారు దరఖాస్తు చేసుకోవచ్చు. పీఎం ముద్రా యోజన కింద గరిష్టంగా రూ.10 లక్షల వరకు రుణం పొందవచ్చు. అయితే ఇందులో కొన్ని కేటగిరిలు ఉన్నాయి. శిశు, కిశోర్, తరుణ్ అనే మూడు కేటగిరిలు ఉన్నాయి. వీటిల్లో శిశు కేటగిరి కింద రూ.50 వేల వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది.
చిరునామా, ఐడెంటిటీ ప్రూఫ్, రెండు ఫోటోలు, బిజినెస్ ప్రూఫ్ వంటివి ఉంటే ఈ రుణం పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం బ్యాంకు బ్రాంచుకు వెళ్లాలి. లేదంటే ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ముద్రా వెబ్‌సైట్‌కు వెళ్లి రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రుణ రేట్లు బ్యాంక్ ప్రాతిపదికన మారుతూ ఉంటాయి.
https://udyamimitra.in/
లింక్ ద్వారా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. చేపల పెంపకం, తేనెటీగల పెంపకం, పౌల్ట్రీ, పశువుల పెంపకం, గ్రేడింగ్, సార్టింగ్, అగ్రిగేషన్ అగ్రో ఇండస్ట్రీస్, డైరీ, ఫిషరీ, అగ్రికల్నిక్స్, అగ్రిబిజినెస్ సెంటర్లు, ఫుడ్ అండ్‌ అగ్రో-ప్రాసెసింగ్ వంటి వ్యవసాయానికి సంబంధించిన వాటికి కూడా రుణాలిస్తారు.

Next Story

Most Viewed