HCUలో ఎంటెక్ విద్యార్థిని ఆత్మహత్య

by  |
HCUలో ఎంటెక్ విద్యార్థిని ఆత్మహత్య
X

దిశ, శేరిలింగంపల్లి : హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో ఎంటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్‌ మండలం తారేపల్లికి చెందిన మౌనికగా గుర్తించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మౌనిక ఎంటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఆదివారం నుండి ఆమె డోర్ ఓపెన్ చేయలేదని, ఫ్రెండ్స్ ఫోన్స్ చేసినా లేపలేదని తెలుస్తోంది. అనుమానంతో ఆమె గది డోర్ పగలగొట్టి చూడగా కిటికీకి ఉరివేసుకుని మృతిచెందినట్లు గుర్తించారు. ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మౌనిక ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Next Story