- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, స్పోర్ట్స్ : భారత జట్టు మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ (International Cricket)కు వీడ్కోలు పలికిన తర్వాత పలువురు క్రికెటర్లు అతనితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ధోని ఒక పాకిస్తాన్ క్రికెటర్ ‘డేటింగ్’ను చెడగొట్టిన విషయం వెలుగులోకి వచ్చింది. క్రీడా వెబ్సైట్ క్రిక్ బజ్ ఈ విషయంపై ఒక కథనం రాసింది.
ఎంఎస్ ధోని ఇంకా భారత జాతీయ జట్టుకు ఎంపిక కాక ముందు ‘ఇండియా ఏ’ జట్టు తరపున కెన్యా పర్యటనకు వెళ్లాడు. అక్కడ జరిగిన ట్రై నేషన్ సిరీస్లో ధోని చెలరేగి ఆడాడు. పాకిస్తాన్ ఏ జట్టుతో జరిగిన ఒక మ్యాచ్లో ధోనీ సిక్సర్ల వర్షం కురిపించాడు. ఆ మ్యాచ్లో బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న పాకిస్తానీ క్రికెటర్ గ్యాలరీలో ఉన్న ఒక భారతీయ యువతితో ఫ్లర్టింగ్ చేశాడు.
మధ్య మధ్యలో ఆమెతో మాట్లాడుతూ చివరకు మ్యాచ్ అనంతరం రెస్టారెంట్కు వెళ్లడానికి ఒప్పించాడు. అయితే ధోని కొట్టిన ఒక సిక్స్ నేరుగా ఆ యువతికి తగలడంతో గాయపడి ఆసుపత్రిలో చేరింది. దీంతో ఆ పాకిస్తానీ క్రికెటర్ డేటింగ్ రద్దయిపోయింది. ఈ విషయాన్ని క్రిక్బజ్ కథనంలో పేర్కొంటూ.. ఆ పాకిస్తాన్ క్రికెటర్ డేటింగ్ను ధోని చెడగొట్టాడు అని రాసుకొచ్చింది. అయితే సదరు క్రికెటర్ ఎవరనేది మాత్రం వెల్లడించలేదు.