ఆ నిందితుడిని ఎన్‌కౌంటర్ చేయండి: ఎమ్మార్పీఎస్

by  |
ఆ నిందితుడిని ఎన్‌కౌంటర్ చేయండి: ఎమ్మార్పీఎస్
X

దిశ, జడ్చర్ల : హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీలో చిన్నారిని బలితీసుకున్న నిందితుడు రాజును ఎన్‌కౌంటర్ చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో చిన్నారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు సురేష్ మాట్లాడుతూ.. ఆధిపత్య వర్గాలకు ఒక న్యాయం.. బడుగు బలహీన వర్గాలకు మరో న్యాయమా అంటూ ప్రశ్నించారు. మైనర్ బాలిక కేసు విషయంలో దిశ చట్టం ఎందుకు అమలు చేయడం లేదని.. తక్షణమే ప్రభుత్వం, అధికార యంత్రాంగం స్పందించి నిందితుడిని ఎన్‌కౌంటర్ చేయాలన్నారు.


Next Story

Most Viewed