కలెక్షన్ కింగ్స్‌గా రెవెన్యూ అధికారులు..

by  |
కలెక్షన్ కింగ్స్‌గా రెవెన్యూ అధికారులు..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో రెవెన్యూ అధికారులు కలెక్షన్ కింగ్స్ లుగా అవతారమెత్తారు. పని కోసం వచ్చిన వారిని డబ్బులు ఇవ్వాలని వేధింపులకు గురిచేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే లంచం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

దీంతో నెల్లూరు జిల్లా రాపూరు మండల తహశీల్దార్ మధుసూధన్, డిప్యూటీ తహశీల్దార్ల జమీర్‌పై అవినీతి ఆరోపణలు పెరిగిపోవడంతో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఇరువురిపై సస్పెన్షన్ వేటు వేశారు. వారితో పాటు మరో ఇద్దరు మహిళా ఉద్యోగులపై విచారణకు ఆదేశించారు. వీరు కూడా అవినీతికి పాల్పడినట్లు తేలితే చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.



Next Story

Most Viewed