ఆ ఎంపీటీసీ కుమారుడు మృతి

by  |
ఆ ఎంపీటీసీ కుమారుడు మృతి
X

దిశ ,తుంగతుర్తి:
సుర్యాపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవ శాత్తు వాగులో పడి ఓ బాలుడు మృతి చెందాడు. ఘటన వివరాల్లోకి వెళితే…. తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామానికి చెందిన ఎంపీటీసీ కోర్నె ప్రవీణ్ కుమార్ తనయుడు కోర్నె వరుణ్ కుమార్ తన స్నేహితులతో కలిసి చేపలు పట్టడానికి గ్రామ శివారులో గల బిక్కెరు వాగు కు వెళ్ళాడు. కాగా మూసీ నది ఉధృతి ఎక్కువగా ఉండటంతో ప్రమాదవశాత్తు వాగులో పడి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీసు బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మూడు రోజులుగా బాలుడి ఆచూకీ కోసం గజ ఈతగాళ్ల తో గాలింపు చర్యలను కొనసాగించారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ,తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ ఘటనా స్థలాన్ని చేరుకొని గాలింపు చర్యలను పర్యవేక్షించారు.

కాగా గ్రామ సమీపంలోని బిక్కెరు వాగులోని చెట్ల పొదల్లో బాలుని మృత దేహం లభ్యమైనట్టు సూర్యాపేట డీఎస్పీ మోహన్ కుమార్ తెలిపారు. బాలుడి మరణవార్త విన్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.



Next Story

Most Viewed