మైండ్‌గేమ్ ఆడటంలో చంద్రబాబు దిట్ట: ఎంపీ విజయసాయి

by  |
mp vijayasaireddy
X

దిశ, విశాఖపట్నం: ప్రభుత్వ పథకాలను పక్కదోవ పట్టించి ఎల్లో మీడియాతో కలసి మైండ్‌ గేమ్‌ ఆడటంలో టీడీపీ అధినేత చంద్రబాబు దిట్ట అని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను చంద్రబాబు అడుగడుగునా అడ్డుకుంటున్నారన్నారు. మూడు రాజధానులే మా విధానమని, ప్రభుత్వ భూముల్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ నిర్మాణం జరుగుతుందన్నారు. విశాఖ భూకుంభకోణంపై వేసిన సిట్‌ నివేదిక సిద్ధమైందని, ప్రభుత్వానికి అందిన వెంటనే అధికారులు బహిర్గతం చేస్తారన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనే ఉద్దేశ్యంతోనే అర్హులైన వారికి ఇళ్లు అందిస్తున్నామన్నారు. ఇప్పటికే విశాఖ జిల్లాలోని 15నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో చర్చించామని, పెండింగ్‌ సమస్యల పరిష్కరానికి కృషి చేస్తామన్నారు.



Next Story

Most Viewed