వైఎస్సార్‌పై ఎంపీ కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

by  |
వైఎస్సార్‌పై ఎంపీ కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, భువనగిరి: రైతుల క్షేమం కోసం ఎన్నో అభివృద్ధి పథకాలు చేపట్టిన గొప్ప నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కొనియాడారు. గురువారం దివంగత ఉమ్మడి ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతి సందర్భంగా భువనగిరి పట్టణంలోని వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియా‌తో మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో కరెంట్ బిల్లు కట్టకపోతే రైతులను జైల్లో వేస్తే.. రైతుల బాధలను తెలుసుకొని అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం ఉచిత కరెంట్ ఫైల్ మీద సంతకం పెట్టిన గొప్ప నేత వైయస్ అని తెలిపారు.

దేశంలో ఎక్కడ లేని విధంగా ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ఉచిత వైద్యం అందించి ఎన్నో ప్రాణాలను కాపాడిన దేవుడని వివరించారు. ప్రతి పేదవాడిని కలిసి వారి బాధలు తెలుసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టిన నేత వైఎస్ అని పేర్కొన్నారు. పాదయాత్రలో తెలుసుకున్న సమస్యలను అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరించినట్లు గుర్తు చేశారు. రూ.34 వేల కోట్లతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ చేపట్టి చేవెళ్ల వరకు సాగునీరు ఇవ్వాలని వైఎస్ఆర్ చూస్తే లక్ష కోట్లు ఖర్చు పెట్టి కొండ పోచమ్మ వరకే కేసీఆర్ నీటిని తీసుకువచ్చినట్లు తెలిపారు. పీసీసీ కమిటీలో ఉన్న నేతలు తమ నియోజక వర్గాల్లో ప్రజలతో మమేకమై అందరికి అందుబాటులో ఉండాలని సూచించారు. అందరం కలిసి కట్టుగా ఉండిలక్ష కోట్లు దోపిడీ చేసిన కేసీఆర్ ను ఓడించాలని ఆయన కోరారు.


Next Story

Most Viewed