ప్రశ్నలు అడిగితే అసత్యాలు చెబుతున్నారు: ఉత్తమ్

by  |
Uttam Kumar Reddy
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్‌లో వ్యవసాయ చట్టాలపై ప్రశ్నలు అడిగితే తప్పుడు సమాధానాలతో తప్పించుకుంటున్నారని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ రైతుల ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. గ్రామాల్లో పంట సేకరణ కేంద్రాలను ఎత్తివేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్న ఉత్తమ్.. టీఆర్ఎస్, బీజేపీ బ్లాక్ డీల్‌తో ముందుకు వెళ్తున్నాయని ఆరోపించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తే టీఆర్ఎస్ స్పదించలేదని మండిపడ్డారు.

Next Story