అణగ దొక్కాలని చూస్తే ఊరుకోం

by  |
అణగ దొక్కాలని చూస్తే ఊరుకోం
X

దిశ, వెబ్ డెస్క్: ఆదివాసీలను అణగ దొక్కాలని చూస్తే తాము చూస్తూ ఊరు కోమని ఎంపీ సోయం బాపూరావు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా సీతా గొందిలో ఎంపీ సోయం బాపూరావు శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివాసీ ఉద్యమ నాయకులను అరెస్టు చేయాలని చూస్తే ఆదివాసీ హక్కుల పోరాట సమితీ, తుడుం దెబ్బ చూస్తు ఊరు కోవని అన్నారు. 17 మంది తుడుందెబ్బ సభ్యులు, ఆదివాసీ ఉపాధ్యాయులపై ములుగు పోలీసులు కేసులు నమోదు చేశారని చెప్పారు. కేసులను వెనక్కి తీసుకోకపోతే మరో ఉద్య మానికి తుడుందెబ్బ సిద్దమని అన్నారు. రాజ్యాంగానికి లోబడే తమ పోరాటం ఉంటుందని ఆయన తెలిపారు.



Next Story

Most Viewed