- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, తెలంగాణ బ్యూరో : పెరిగిన నిత్యవసరాల ధరలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలపై పార్లమెంట్లో పోరాటం చేసేందుకు టీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు ముఖం చాటేశారు, ప్రధాని మోడీ అంటే భయపడుతున్నారా… రాజీ పడుతున్నారా అని కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్కు గురువారం బహిరంగ లేఖ రాశారు.
ఈ సందర్భంగా సవాల్ విసిరారు. టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్కు రావడం లేదని, దీనిపై సమాధానం చెప్పాలన్నారు. బీజేపీపై ఏదైనా పోరాటం చేద్దామంటూ టీఆర్ఎస్ ఎంపీలు కనిపించకుండా పోతున్నారన్నారు. బీజేపీపై టీఆర్ఎస్ చేస్తున్న గల్లీలో మాటలకు, ఢిల్లీలో చేతలకు పొంతన లేదని రేవంత్రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సమస్యలను వదిలి విశాఖ ఉక్కు పోరాటానికి మద్దతు తెలుపుతున్నామంటూ ప్రకటిస్తున్నారని, దీని వెనుక దురుద్ధేశం ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధికోసమే ఈ ఎత్తుగడ వేస్తున్నారని, విభజన చట్టంలో తెలంగాణకు రావాల్సిన వాటిపై పోరాటం చేయరు కానీ విశాఖ ఉక్కు కోసం పోరాడుతారా అంటూ ప్రశ్నించారు.
టీఆర్ఎస్ మోసం సరిహద్దులు దాటుతోందని, ఎంపీలో పార్లమెంట్లో పోరాటం చేయరని, జంతర్మంతర్ దగ్గర దీక్షకు రారని రేవంత్ దుయ్యబట్టారు. ఎన్నికలప్పుడు హక్కుల గురించి గొంతు చించుకోవడం, ఎన్నికలయ్యాక వాటిని మర్చిపోవడం టీఆర్ఎస్కు అలవాటేనని, టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్కు వస్తారా, జంతర్ మంతర్ దగ్గర దీక్షలో కూర్చుంటారా స్పష్టం చేయాలని రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు.