‘చేవెళ్ల టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి మిస్సింగ్’

by  |
‘చేవెళ్ల టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి మిస్సింగ్’
X

దిశ, జల్‎పల్లి: చేవెళ్ల పార్లమెంట్​సభ్యులు రంజిత్​ రెడ్డి కనిపించడం లేదని బీజేవైఎం నేతలు మీర్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. లోక్‌సభ ఎన్నికలు జరిగి రెండేళ్లు పూర్తి అవుతున్నా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో ఎక్కడా కనిపించలేదని.. కనీసం ప్రభుత్వ అధికార కార్యక్రమాల్లో కూడా పాల్గొనలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో హామీల వర్షం కురిపించిన ఆయన.. ప్రస్తుతం అధికార లాంఛనాలు అనుభవిస్తున్నారన్నారు. కానీ ప్రజలకు మాత్రం అందుబాటులో లేరని ఆరోపించారు. నియోజకవర్గంలో అభివృద్ది కుంటుపడిందని చేవెళ్ల ఎంపీ రంజిత్​ రెడ్డి ఆచూకీ తెలపాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారం ప్రస్తుతం ఎంపీ నియోజకవర్గంలో హాట్‌ టాపిక్‌గా మారింది.


Next Story

Most Viewed