పాలెగాళ్ల పాలన నడుస్తోంది -రఘురామ

by  |
పాలెగాళ్ల పాలన నడుస్తోంది -రఘురామ
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో ప్రస్తుతం పాలెగాళ్ల పాలన నడుస్తోందని ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్రకు విజయసాయిరెడ్డి ఓ పాలెగాడన్నారు. తన నియోజకవర్గంలో ఇంకో పాలెగాడు ఆవ భూముల్లో అవినీతికి పాల్పడినట్లు తెలిపారు.

అమరావతి రైతులపై సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు బాధాకరమన్నారు. ఇంత జరుగుతున్నా సీఎం జగన్​ నీరో చక్రవర్తిలా పట్టించుకోవడం లేదని చెప్పారు. రాష్ట్రంలోని అస్తవ్యస్త పరిస్థితులపై రాష్ర్టపతికి లేఖ రాసినట్లు తెలిపారు. జగతి పబ్లికేషన్స్​లో బాలశౌరి పెట్టుబడులపై సీబీఐకి ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు.


Next Story

Most Viewed