ఢిల్లీ ఉద్యమం తెలంగాణలో చేయాలి: కోమటిరెడ్డి

by  |
ఢిల్లీ ఉద్యమం తెలంగాణలో చేయాలి: కోమటిరెడ్డి
X

దిశ, భువనగిరి: రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయని స‌ర్కార్‌పై యుద్ధానికి సిద్ధం కావాల‌ని భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి పిలుపునిచ్చారు. పోరాటం చేస్తే త‌ప్ప స‌ర్కార్ ఐకేపీ సెంట‌ర్లను ప్రారంభించేలా లేద‌ని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే వెంట‌నే ఐకేపీ సెంట‌ర్లు ప్రారంభించాల‌ని సీఎం కేసీ‌‌ఆర్‌కు మంగళవారం బ‌హిరంగ లేఖ రాశారు. లేనిపక్షంలో ఢిల్లీ తరహాలో తెలంగాణలో యుద్ధం చేయడానికి రైతులు ఏకం కావాలన్నారు. నాగార్జున సాగ‌ర్ ఎన్నిక‌ల సమయంలో ఓట్ల కోసం ఐకేపీ సెంట‌ర్లు ప్రారంభిస్తామ‌ని చెప్పిన సర్కార్.. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. దీనిపై రైతన్నలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని.. రైతుల పోరాటానికి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.

Next Story

Most Viewed