సీఎం కేసీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి లేఖ.. ఏమన్నారంటే !

by  |
సీఎం కేసీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి లేఖ.. ఏమన్నారంటే !
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మూడు నెలల నుంచి రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో భవన నిర్మాణాలు, రియల్​ఎస్టేట్​రంగం కుదేలైందని కాంగ్రెస్​ఎంపీ కోమటిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కండ్లు తెరిచి పాత పద్దతిలో రిజిస్ట్రేషన్లు చేయాలనే నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామమన్నారు. ఈ మేరకు ఆదివారం సీఎం కేసీఆర్‌కు ఎంపీ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రజలను ఇబ్బంది పెట్టే చర్యలకు పూనుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి వెబ్‌సైట్​ప్రజలకు ఇబ్బందిగా మారిందని, ధ‌ర‌ణి ప్రకారం పాస్‌బుక్‌లు త‌ల్లిదండ్రుల నుంచి వార‌సుల పేరు మీద‌కు మారాలంటే ఒక్కో ఎక‌రాకు రూ. 3వేలు రైతుపై భారం పడుతుందన్నారు. రిజిస్ట్రేషన్లపై వెనక్కి తగ్గినట్టే ఎల్ఆర్ఎస్‌పై వెనక్కి తగ్గాలని కోరారు.

Next Story

Most Viewed