ఉత్తమ్‌తో భేటీ అనంతరం ఢిల్లీ వెళ్లిన కోమటిరెడ్డి.. కాంగ్రెస్ నేతల్లో టెన్షన్

by  |
Komatireddy Venkat Reddy, Uttam Kumar Reddy
X

దిశ, వెబ్‌డెస్క్: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో నల్లగొండ ఎంపీ, కాంగ్రెస్ కీలక నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమావేశం అయ్యారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఆదవారం ఇరువురు భేటీ అయ్యారు. టీపీసీసీ పదవిపై సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అంతేగాకుండా.. భేటీ ముగిసిన అనంతరం కోమటిరెడ్డి ఢిల్లీ బయలుదేరాడు. దీంతో కాంగ్రెస్ నేతల్లో, పీసీసీ ఆశావహుల్లో ఆందోళన నెలకొంది.

టీపీసీసీ అధ్యక్షుడి విషయంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో కోమటిరెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లిడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి మాణికం ఠాగూర్ అందరి అభిప్రాయాలను సేకరించి హైకమాండ్‌కు నివేదిక అందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతి త్వరలోనే పీసీసీ చీఫ్ పేరును హైకమాండ్ ప్రకటించనుంది.

Next Story