వేగం పెంచిన కోమటిరెడ్డి.. సెంట్రల్ మినిస్టర్‌తో కీలక భేటీ

by  |
MP Komatireddy Venkat Reddy
X

దిశ, భువనగిరి: కాంగ్రెస్ కీలక నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవ్యతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిపై కీలకంగా చర్చించారు. బీబీనగర్ ఎయిమ్స్‌లో చేరబోయే థర్డ్ ఇయర్ విద్యార్థులకు ఉపయోగపడే ఇంఫ్రాస్ట్రక్చర్, భవనం ఇతర వసతులు సమకూర్చాలని అభ్యర్థించారు. ఎంపీ విజ్ఞప్తికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఎయిమ్స్ సిబ్బంది అభ్యర్థించిన 20 శాతం అదనపు బిల్డింగ్‌ను వెంటనే ఆమోదించారు. ఈ మేరకు సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు. అంతేగాకుండా.. వారంరోజుల్లో భవన నిర్మాణానికి టెండర్లు పిలువాలని ఆదేశించారు. కాగా, తెలంగాణ పీసీసీ అధ్యక్షులుగా మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డిని ఎన్నుకున్న దగ్గరనుంచి కోమటిరెడ్డి జిల్లాకే పరిమితమై, అభివృద్ధి పనుల్లో వేగం పెంచారు.


Next Story