జానారెడ్డి గెలుపును కేసీఆర్ ఆపలేరు: కోమటిరెడ్డి

by  |
Komati Reddy KCR
X

దిశ, హాలియా: జానారెడ్డి గెలుపును కేసీఆర్ ఆపలేరని.. సాగ‌ర్‌లో ఇంకో ప‌ది మీటింగ్‌లు పెట్టిన విజయం కాంగ్రెస్‌దే అంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నికలో భాగంగా బుధవారం గుర్రంపోడు మండలంలో ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ కార్యకర్తలపై బెదిరింపులకు దిగుతున్న అధికార పార్టీకి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, ఇంటికో ఉద్యోగం ఇస్తానని సీఎం మభ్యపెడుతున్నారన్నారు. కాళేశ్వర ప్రాజెక్టులో దోచుకున్న డబ్బులను సాగర్ ఉపఎన్నికలో ఖర్చుపెడుతన్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. రోజుకు వేల సంఖ్యల్లో కరోనా కేసులు నమోదు అవుతుంటే లక్ష మందితో హాలియా సభ నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు. ఇతర పార్టీల సభలకు ఆంక్షలు పెడుతున్న పోలీసులు.. అధికార పార్టీకి ఎందుకు అనుమతి ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed