ఎన్నికలయ్యాక భైంసాను మేం కాపాడుకుంటాం : బండి

by  |
ఎన్నికలయ్యాక భైంసాను మేం కాపాడుకుంటాం : బండి
X

దిశ, వెబ్‌డెస్క్ : ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం భైంసాను తాము కాపాడుకుంటామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తెలిపారు. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అత్యాచార బాధితురాలిని గురువారం ఆయన పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. బాలికపై అత్యాచారానికి పాల్పడటం అమానుషం అని అన్నారు. మైనర్ మీద అఘాయిత్యానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అల్లర్లలో భాగంగా ఓ వర్గానికి చెందిన కొందరు తన కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధిత తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని భైంసాలో ఇటీవల పలుమార్లు కమ్యూనిటీ గొడవలు జరిగినప్పటికీ, పోలీసులు ఓ వర్గానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బాలిక కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. భైంసాను ఎంఐఎం చేతిలో పెట్టారని, దాంతో ఓ వర్గం కావాలనే తరచూ అల్లర్లకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. జర్నలిస్టులు, పోలీసులపై దాడులు జరిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత భైంసాను మేము కాపాడుకుంటామని బండి సంజయ్ స్పష్టంచేశారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story