వాటిలో రాజకీయ జోక్యం వద్దు : బండి సంజయ్

by  |
వాటిలో రాజకీయ జోక్యం వద్దు : బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్ : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్య మతస్థుల డిక్లరేషన్‌పై చోటుచేసుకున్న వివాదంపై తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. తిరుమల ఆలయంలో ఆచారాలు, సంప్రదాయాలు అనాదిగా వస్తున్నాయని, వాటిలోని లోటుపాట్లను విచారించి, శాస్త్ర పద్ధతుల్లో చర్చించేది స్వామిజీలు, పీఠాధిపతులేనని అన్నారు.

ఈ వ్యవహారంలో రాజకీయ నేతలు తలదూర్చడం భావ్యం కాదన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న నేతల్ని కట్టడి చేయాల్సిన అవసరం ఆయా పార్టీల పెద్దలపై ఉందని ఎంపీ బండి సంజయ్ సూచించారు.ఈ విషయంలో శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినక ముందే ఆయా పార్టీల పెద్దలు నిర్ణయం తీసుకోవాలన్నారు.

Next Story

Most Viewed