తరలిస్తే చూస్తూ ఊరుకోం: ఎంపీ బడుగుల

by  |
తరలిస్తే చూస్తూ ఊరుకోం: ఎంపీ బడుగుల
X

దిశ, నల్లగొండ: తెలంగాణ రైతాంగ అభివృద్ధి కోసం కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం నేరేడుచర్లలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటిని ఏపీ ప్రభుత్వం తరలిస్తుంటే.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ.. శ్రీశైలం నుంచి అక్రమంగా ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకానికి నీళ్లు తరలించడాన్ని ఖండిస్తున్నామన్నారు. తెలంగాణ రైతాంగం శ్రేయస్సుకు ఆటంకం కలిగితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని ఎమ్మెల్యే హెచ్చరించారు.

Next Story

Most Viewed