సీఎం కేసీఆర్‌పై ఎంపీ అరవింద్ ఫైర్

by  |
సీఎం కేసీఆర్‌పై ఎంపీ అరవింద్ ఫైర్
X

దిశ, దుబ్బాక: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన ఆరోపణలు చేశారు. సిద్దిపేల జిల్లా దుబ్బాక పట్టణంలో బీజేపీ నిర్వహించిన బైక్ ర్యాలీలో అర్వింద్ పాల్గొని మాట్లాడుతూ.. ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ దుబ్బాకలో కాకుండా, జనగామలో మీటింగ్ పెట్టాడని విమర్శించారు. నియంత్రిత సాగు విధానంతో రైతులకు సన్నబియ్యం పండించాలని చెప్పి, ఇప్పుడు బేరం చేస్తున్నాడని వెల్లడించారు. అంతేగాకుండా తానేదో డాక్టర్ అన్నట్టు రాష్ట్రంలోకి కరోనాను రానివ్వను, వస్తే అడ్డుకుంటం అని మాట్లాడి, చివరకు పారాసిటమాల్ వేసుకోమన్నాడు అని విమర్శించారు. కేంద్రం ఇస్తున్న నిధులను పక్కదారి పట్టిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్య ప్రచారాలు చేయడంలో కేసీఆర్ నంబర్ వన్ అని అన్నారు. అంతేగాకుండా రైతులు బాగుండాలంటే, నీళ్లు, నిధులు రావాలంటే దుబ్బాకలో బీజేపీ గెలిపించాలని కోరారు.

Next Story

Most Viewed