ఓటీటీలో సందడి చేయనున్న 'మైఖేల్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

by Disha Web Desk 7 |
ఓటీటీలో సందడి చేయనున్న మైఖేల్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
X

దిశ, వెబ్‌డెస్: టాలీవుడ్ హీరో సందీప్ కిషన్, డైరెక్టర్ రంజిత్ జయంకోడి కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా 'మైఖేల్'. ఫిబ్రవరి 3న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందింది. దీంతో రీలీజైన 21 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుంది. 'మైఖేల్' సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా సొంతం చేసుకుంది. ఈ మేరకు డిజిటల్ స్క్రీమింగ్ డేట్‌ను కూడా ప్రకటించింది. ఫిబ్రవరి 24న స్ట్రీమింగ్ కాబోతున్నట్లు అనౌన్స్ చేసింది ఆహా. కాగా.. ఈ మూవీలో సందీప్‌కు జోడిగా దివ్యాంశ కౌశిక్ నటించింది.


Next Story