అమితాబ్ Amitabh Bachchan ప్రచార హక్కులకు భంగం.. ఢిల్లీ కోర్టు కీలక ఆదేశాలు

by Disha Web Desk 4 |
అమితాబ్ Amitabh Bachchan ప్రచార హక్కులకు భంగం.. ఢిల్లీ కోర్టు కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: అమితాబ్ ప్రచార హక్కులకు భంగం విషయంలో ఢిల్లీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ స్వరం, ఫోటోలు, ఆయనకు సంబంధించిన క్లిప్పింగ్ లు ఎవరూ వాడరాదంటూ ఢిల్లీ కోర్టు తెలిపింది. ప్రముఖ వ్యక్తి అయినందున ఆయన ప్రచార హక్కులకు భంగం కలిగిస్తూ కేబీసీ లాటరీ నిర్వాహకులు, కొన్ని ఇతర సంస్థలు ప్రజలను తప్పుదొవ పట్టిస్తున్నారంటూ అమితాబ్ పిటిషన్ వేశారు. శుక్రవారం విచారణ అనంతరం ఢిల్లీ హైకోర్టు ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. విచారణను వచ్చే ఏడాది మార్చికి వాయిదా వేశారు. ఇలాంటి సంస్థలు చేస్తున్న తప్పుడు ప్రచారం కారణంగా అమితాబ్ పేరు, ప్రతిష్టలు దెబ్బ తింటాయని ఈ సందర్భంగా జస్టిస్ చావ్లా తెలిపారు.



Also Read......


" యశోద " Yashoda సినిమా సెకండ్ వీక్ కలెక్షన్స్


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed