ప్రముఖ యాంకర్ గీతా అయ్యర్ కన్నుమూత

by Disha Web Desk 19 |
ప్రముఖ యాంకర్ గీతా అయ్యర్ కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ టీవీ న్యూస్ యాంకర్ గీతా అయ్యర్ మృతి చెందారు. బుధవారం ఆమె తుది శ్వాస విడిచినట్లు ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. కాగా, భారత్‌లో తొలితరం ఇంగ్లీష్ న్యూ్స్ ప్రెజెంటర్‌గా గుర్తింపు పొందిన గీతా అయ్యర్.. 1971‌లో ప్రముఖ దూర్శదర్శన్‌ చానెల్‌లో చేరారు. దూరదర్శన్‌లో ఇంగ్లీష్‌లో వార్తలు చదివిన వారిలో ఒకరిగా అయ్యర్ మంచి గుర్తింపు పొందారు. ఇక, గీతా అయ్యర్ నాలుగు సార్లు బెస్ట్ యాంకర్ అవార్డులను గెల్చుకున్నారు. అంతేకాకుండా 30 ఏళ్లకు పైగా వివిధ నేషనల్ చానెల్స్‌లో పని చేసిన ఆమె.. 1989లో ఇందిరాగాంధీ ప్రియదర్శిని అవార్డ్‌ను కూడా పొందారు. గీతా అయ్యర్ మరణవార్త తెలుసుకున్న పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.



Next Story

Most Viewed