పెళ్లైన మరుక్షణమే అక్కడ వేరు కాపురం పెట్టబోతున్న వరుణ్-లావణ్య

by Disha Web Desk 9 |
పెళ్లైన మరుక్షణమే అక్కడ వేరు కాపురం పెట్టబోతున్న వరుణ్-లావణ్య
X

దిశ, వెబ్‌డెస్క్: గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వరుణ్ తేజ్-లావణ్య పెళ్లి వార్తలే వినిపిస్తున్నాయి. తాజాగా వీరి గురించి మరో వార్త నెట్టింట వైరల్‌గా మారింది. అయితే వరుణ్, లావణ్య నవంబరు 1 వ తారీకున ఇటలీలో గ్రాండ్‌‌గా వివాహం చేసుకున్నాక.. మరుక్షణమే హైదరాబాదులోని జూబ్లీహిల్స్‌లో కొత్త కాపురం పెట్టబోతున్నారంటూ టాక్ వినిపిస్తుంది. లావణ్య కోసం వరుణ్ స్పెషల్‌గా 7 కోట్ల రూపాయలు పెట్టి ఆల్రెడీ ఓ ప్లాట్ కూడా కొన్నారంటూ సమాచారం. ఈ విషయాన్ని రీసెంట్‌గా చిరంజీవికి తెలియడంతో ఏమనలేక సైలెంట్‌గా ఉన్నారట. ‘‘ఇన్నాళ్లైనా రామ్ చరణ్-ఉపాసన.. చిరంజీవి, సురేఖలతో ఉన్నారు.. కానీ వీరేంటి పెళ్లిన మరుసటి రోజే కొత్త ఇంటికి మకాం మార్చేలానుకుంటున్నారు’’ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

ఇవి కూడా చదవండి : మేము విడిపోయామంటూ శిల్పాశెట్టి భర్త ఎమోషనల్ ట్వీట్.. విడాకులు తీసుకున్నారా?

Next Story

Most Viewed