‘మండాల మర్డర్స్‌’ నన్ను మరో మెట్టు ఎక్కిస్తుంది.. బాలీవుడ్ నటి

by Disha Web Desk 10 |
‘మండాల మర్డర్స్‌’ నన్ను మరో మెట్టు ఎక్కిస్తుంది.. బాలీవుడ్ నటి
X

దిశ, సినిమా: ‘మండాల మర్డర్స్‌’ వెబ్‌సిరీస్‌ ద్వారా ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వడంపై వాణీ కపూర్‌ సంతోషం వ్యక్తం చేసింది. గోపీ పుత్రన్‌ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌‌ను యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించగా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు ప్రమోషన్స్ నిర్వహిస్తున్న నటి.. తన తొలి ఓటీటీ అనుభవాలను అభిమానులతో షేర్ చేసుకుంది. ‘క్రైమ్‌ థ్రిల్లర్స్‌లో ఇదొక సరికొత్త ప్రయోగం. ఓటీటీ ఎంట్రీ, అసాధారణమైన కథ కోసం ఎదురుచూస్తున్న క్రమంలోనే ఈ సిరీస్‌ నన్ను వెతుక్కుంటూ వచ్చింది. విజయానికి షార్ట్‌కట్స్ లేవనే సిద్ధాంతాన్ని బాగా నమ్ముతా. అందుకే ఇందులో నేను పోషించిన పాత్ర కోసం చాలా పరిశోధన చేశా. నన్ను నేను కొత్త పంథాలో ఆవిష్కరించుకోవడానికి గొప్ప అవకాశంగా భావిస్తున్నా. ఈ సిరీస్‌ నన్ను నటిగా మరో మెట్టు ఎక్కిస్తుందని బలంగా నమ్ముతున్నా’ అంటూ చెప్పుకొచ్చింది.

Read More : ఆ హీరోయిన్ వల్ల నమ్రత మహేష్ బాబుతో విడాకులు తీసుకోవాలనుకుందా?

Next Story

Most Viewed