బుల్లితెరపై రీ ఎంట్రీ ఇవ్వనున్న ఉదయభాను

by Disha Web Desk 8 |
బుల్లితెరపై రీ ఎంట్రీ ఇవ్వనున్న ఉదయభాను
X

దిశ, సినిమా : స్టార్ యాంకర్ ఉదయభాను గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు ఏ షో జరిగినా, ఏ ఈవెంట్ అయినా ఉదయభాను ఉండాల్సిందే. ఆమె అందం, మాటల గారడితో ఎంతో మందిని మాయచేసింది. అలాంటి ఈ భామ చాలా రోజుల నుంచి యాంకరింగ్‌కు దూరమైంది.

అయితే ఈ ముద్దుగుమ్మ మళ్లీ యాంకరింగ్ చేస్తే చూడాలని తమ ఫ్యాన్స్ ఎంతగానో కోరుకుంటున్నారు. కాగా, వారి కోరిక తీరనున్నట్లు తెలుస్తోంది. అది ఎలా అనుకుంటున్నారా.. అందాలభామ ఉదయభాను మరోసారి యాంకర్‌గా రీ ఎంట్రీ ఇస్తున్నారు. జీ తెలుగులో ప్రసారం కానున్న ఓ షోలో ఆమె తన హోస్టింగ్‌తో సందడి చేయనుంది.

అసలు విషయంలోకి వెళ్లితే .. జీ తెలుగులో జనవరి 28న సూపర్ జోడీ ప్రారంభం కానుంది. ఈ షోకు సీనియర్ హీరోయిన్ మీనా జడ్జిగా వ్యవహరించగా, ఉదయభాను హోస్ట్‌గా వ్యవహరించింది. తాజాగా అమ్మ చెప్పేది అమ్మగా గెలిస్తే అన్నింటిలో గెలిచినట్టు అని, అమ్మ అయ్యాకే అమ్మ చెప్పింది గుర్తు వచ్చింది. అన్నీ పక్కన పెట్టేశాను.. పిల్లలే జీవితం అయిపోయాను అంటూ ఉదయభాను తన పర్సనల్ లైఫ్ గురించి చెప్తున్న మాటలతో ఓ ప్రోమా ప్రారంభమైంది. అదే సమయంలో ఆపొద్దు అమ్మ అంటూ తన పిల్లలు చెప్పడంతో సూపర్ జోడీతో యాంకర్‌‌గా రీ ఎంట్రీ ఇస్తున్నట్లు ఆమె ప్రకటించింది. గోల్డెన్ లేడీ ఆఫ్ జీ తెలుగు ఈజ్ బ్యాగ్ అని ట్యాగ్‌తో ఉదయభాను ప్రోమోను జీ తెలుగు ప్రోమో విడుదలైంది.దీంతో ఉదయభాను ఫ్యాన్స్‌లో ఆనందం అంతా ఇంతా కాదు.



Next Story

Most Viewed