Guntur Karam : ఎవరూ ఊహించని హీరోయిన్‌ను తీసుకున్న త్రివిక్రమ్..

by Dishanational2 |
Guntur Karam :  ఎవరూ ఊహించని హీరోయిన్‌ను తీసుకున్న త్రివిక్రమ్..
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గుంటూరు కారం’. కాగా గత కొద్ది రోజులుగా పలు కారణాల వల్ల షూటింగ్ స్టార్ట్ కాలేదనే టాక్ వినిపిస్తోంది. చిత్రీకరణ మొదలవుతుందో లేదో అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే ఈ రూమర్స్‌తో నిరాశలో ఉన్న ఫ్యాన్స్‌‌ మళ్లీ షూటింగ్ మొదలైందనే న్యూస్‌తో హ్యాపీగా ఉన్నారు. ఇక ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో ముందుగా పూజా హెగ్డేను మెయిన్ హీరోయిన్‌గా, శ్రీ లీలను సెకండ్ హీరోయిన్‌గా తీసుకున్నారు. అయితే కారణం తెలియనప్పటికీ పూజా హెగ్డే ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో శ్రీ లీల ఇప్పుడు మెయిన్ హీరోయిన్ పాత్రలోకి వచ్చేసింది. దీంతో సెకండ్ హీరోయిన్ కోసం త్రివిక్రమ్ జల్లెడ పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే మొన్నటి వరకు సంయుక్తా మీనన్ పేరు వినిపించినప్పటికీ ఇప్పుడు హీరోయిన్ మీనాక్షి చౌదరిని తీసుకున్నట్లు సమాచారం. ‘ఖిలాడీ’, ‘హిట్ 2’ వంటి సినిమాలతో ఆకట్టుకున్న మీనాక్షి చౌదరి మహేష్ బాబు మూవీలో అవకాశం అందుకుందంటే లక్ అనే చెప్పాలి.

Read more:

Guntur Karam : ‘గుంటూరు కారం’ షూటింగ్ బరిలోకి దిగిన మహేష్ బాబు

Sreeleela : శ్రీలీల కారణంగా పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తున్న పూజా హెగ్డే

Next Story