రామ్ చరణ్ పెట్ డాగ్‌తో దర్శనమిచ్చి షాకిచ్చిన త్రిష.. మిస్ యూ అంటూ ఆసక్తికర పోస్ట్

by Disha Web Desk 6 |
రామ్ చరణ్ పెట్ డాగ్‌తో దర్శనమిచ్చి షాకిచ్చిన త్రిష.. మిస్ యూ అంటూ ఆసక్తికర పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు ప్రభాస్, పవన్ కల్యాణ్, నాగార్జున, ఎన్టీఆర్, వెంకటేష్, బాలకృష్ణ వంటి స్టార్ హీరో చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుంది. గత కొద్ది రోజుల నుంచి ఆమె తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు చేయడం లేదు. కానీ తమిళ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇటీవల త్రిష లియో మూవీతో సూపర్ హిట్ అందుకుంది. 40 ఏళ్లు వచ్చినప్పటికీ పెళ్లి చేసుకోకుండా వరుస చిత్రాల్లో నటిస్తూ దూసుకెళ్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు చిరంజీవి విశ్వంభరతో మళ్లీ చాలా రోజుల తర్వాత తెలుగులో నటిస్తుంది.

మెగాస్టార్ మూవీ షూటింగ్‌లో పాల్గొంటూనే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతూ అభిమానులకు దగ్గరగా ఉంటోంది. తాజాగా, త్రిష, టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెట్ డాగ్‌తో దర్శనమిచ్చింది. ఆ డాగ్ పేరు రైమ్ అన్న సంగతి తెలిసిందే. నిత్యం రామ్ చరణ్- ఉపాసన దంపతులు ఎక్కడికి వెళ్ళినా సరే తమ వెంట తీసుకుని వెళుతుంటారు. అయితే ఇప్పుడు రైమ్‌తో త్రిష ఆడుకుంటూ కనిపించడంతో అంతా షాక్ అవుతున్నారు. అంతేకాకుండా ఎట్టకేలకు రైమ్‌ను కలుసుకున్నాను. మిస్ యు. ఏప్రిల్‌తో సరదా సమయం కోసం ఎదురుచూస్తున్నాను’’ అంటూ వరుస పోస్టులు పెట్టింది. ఇక అది చూసిన వారంతా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. రామ్ చరణ్, త్రిష కలిసి ఏ సినిమాలో నటించలేదు.

కానీ రామ్ చరణ్ పెట్ డాగ్‌ను త్రిషకు ఇచ్చే అంత సాన్నిహిత్యం వీరిద్దరి మధ్య చూసి కొందరు ఆశ్చర్యపోతున్నారు. అయితే త్రిష, చరణ్ నటించకపోయినా కానీ వీరిద్దరి మధ్య ఎప్పటినుంచో మంచి స్నేహం ఉందట. అందుకే చిరు కోసం ఇంటికి వెళ్లినప్పుడు త్రిష రైమ్‌తో టైమ్ స్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. కానీ త్రిష పోస్టులు చూసిన నెటిజన్లు కొందరు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు కాన్సెప్ట్‌ను ఫాలో అవుతున్నావా బ్రో? అంటూ దారుణంగా కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం నీకు ఆమెతో టచ్ లేకపోయినా నీకు ఇష్టమైన పెట్ డాగ్‌ను ఇచ్చావంటే మాకు డైట్ వస్తుందని? అంటున్నారు.

Read More..

ఇన్‌స్టాగ్రామ్ వాడుతోన్న రామ్ చరణ్ పెట్ డాగ్! 80 వేల పైన ఫాలోవర్స్.. ఏం ఏం పోస్టులు పెట్టిందంటే?








Next Story

Most Viewed