2022లో చనిపోయిన సినీ, రాజకీయ ప్రముఖులు వీరే..

by Disha Web Desk 4 |
2022లో చనిపోయిన సినీ, రాజకీయ ప్రముఖులు వీరే..
X

దిశ, వెబ్ డెస్క్: 2022 రాజకీయ, సినీరంగాల్లో విషాదాన్ని నింపింది. ఈ ఏడాది రాజకీయ, సినీ రంగానికి సేవలందించిన ప్రముఖులు కన్నుమూశారు. సినీ రంగానికి తన గాత్రంతో విశేష సేవలందించిన లతా మంగేష్కర్, తెలుగు సినీ హీరోలుగా దశాబ్దాలుగా కొనసాగిన రెబల్ స్టార్ కృష్ణం రాజు, సూపర్ స్టార్ కృష్ణ, కైకాల సత్యనారాయణ, చలపతిరావు ఇటీవల వివిధ కారణాలతో నింగికేగారు.

ఈ జాబితాలోనే బాలీవుడ్ ఫేమస్ సింగర్ బప్పీ లహరి, ఒడిసా మాజీ ముఖ్యమంత్రి హేమానంద బిశ్వాల్, పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా, బాలీవుడ్ సింగర్ క్రిష్ణ కుమార్ కున్నత్, పొలొంన్జీ షాపూర్ జీ మిస్త్రీ, ఒక్క రూపాయి డాక్టర్‌గా ప్రసిద్ధి గాంచిన సుశోవన్ బెనర్జీ, స్టాక్ ట్రేడర్ సంచలనం రాకేష్ ఝున్ ఝున్ వాలా, టాటా గ్రూప్ వ్యహహారాలు చూసిన సైరస్ మిస్త్రీ, బాలీవుడ్ ఫేమస్ కమెడియన్ రాజు శ్రీవాస్తవ, మాజీ యూపీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ ఫౌండర్ ములాయం సింగ్ యాదవ్, బాలీవుడ్ నటుడు విక్రమ్ గోఖలే ఈ ఏడాది కన్నుమూశారు. వీరు ఆయా రంగాల్లో విశిష్ట సేవలందించి ప్రత్యేకత చాటుకున్నారు.

Also Read..

Prabhas Unstoppable షో ఎంత మంది చూశారో తెలిస్తే..షాక్ !



Next Story

Most Viewed