కమిటీ కుర్రోళ్ళు డైరెక్టర్‌తో మెగా ప్రిన్స్ సినిమా..? కలిసొచ్చేనా..

by I. Sairam |

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) ప్రస్తుతం మంచి హిట్ కోసం కష్టపడుతున్నారు.

కమిటీ కుర్రోళ్ళు డైరెక్టర్‌తో మెగా ప్రిన్స్ సినిమా..? కలిసొచ్చేనా..
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) ప్రస్తుతం మంచి హిట్ కోసం కష్టపడుతున్నారు. ఇందులో భాగంగా ఆయన నటిస్తున్న లేటెస్ట్ హారర్ కామెడీ జానర్ ఎంటర్టైనర్ మూవీ ‘కొరియన్ కనకరాజు’(Korean Kanakaraju). మేర్లపాక గాం(Merlapaka Gandhi) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో యంగ్ బ్యూటీ రీతికా నాయక్(Reethika Nayak) హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, సీనియర్ నటి తులసి, సత్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. యువీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు భారీ స్థాయిలో సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మ్యూజిక్ లెజెండ్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన 'తొలిప్రేమ' మంచి మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. దీంతో ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అవుతోంది.

ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతుండగా... ఈ సమ్మర్‌కు సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. గత కొంతకాలంగా వరుణ్ తేజ్ ఖాతాలో సరైన హిట్ పడలేదు. ఈ మూవీతోనైనా మంచి హిట్ కొట్టాలని అంతా భావిస్తున్నారు. ఈ క్రమంలో మరో న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది, వివరాల్లోకి వెళితే.. కొరియన్ కనకరాజు సినిమా పూర్తయిన తర్వాత నిహారిక(Niharika) నిర్మాణంలో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. వరుణ్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన నిహారిక మొదట వెబ్ సిరీస్‌లు ప్రొడ్యూస్ చేశారు.

'కమిటీ కుర్రాళ్ల' సినిమాతో వెండితెరపైకి నిర్మాతగా అడుగుపెట్టారు. అది మంచి విజయం సాధించింది. ఆ తర్వాత సంగీత్ శోభన్(Sangeeth Sobhan) హీరోగా 'రాకాస'(Rakasa) సినిమా తీస్తున్నారు. ఇటీవల ఆ సినిమా టీజర్ విడుదల అయింది. ఇప్పుడు అన్నయ్యతో సినిమా చేయడానికి సన్నాహలు చేస్తున్నారని సమాచారం. ఇక దీనికి కూడా కమిటీ కుర్రోళ్ళు డైరెక్టర్ యదు వంశీ(Yadu Vamshi) దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. త్వరలో షూటింగ్ కూడా స్టార్ట్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే కనుక నిజమైతే వరుణ్ మంచి కంబ్యాక్ ఇస్తాడనే చెప్పవచ్చు. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story