Kiara Advani : తన భర్త సినిమాటిక్‌గా ప్రపోజ్ చేశాడని చెప్తూ ఏడ్చేసిన కియారా అద్వానీ

by Disha Web Desk 6 |
Kiara Advani : తన భర్త సినిమాటిక్‌గా ప్రపోజ్ చేశాడని చెప్తూ ఏడ్చేసిన కియారా అద్వానీ
X

దిశ, సినిమా: బాలీవుడ్ క్యూట్ కపుల్స్‌లో కియారా అద్వానీ, సిద్ధార్థ్‌ మల్హోత్ర ఒకరు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కియార.. సిద్ధార్థ్ మల్హోత్ర తనకు ప్రపోజ్‌ చేసిన క్షణాలను గుర్తుచేసుకుంది. ఆ మూమెంట్స్ ఎప్పటికీ మరచిపోలేనంటూ ఎమోషనల్ అయిపోయింది. ‘‘షేర్షా’ సినిమా తర్వాత మా మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. కొద్ది రోజుల తర్వాత సిద్ధార్థ్‌ కుటుంబ సభ్యులతో కలిసి రోమ్‌ టూర్‌కు వెళ్లా. నాకు అప్పుడే అర్థమైంది సిద్ధార్థ్‌ నాకు ప్రపోజ్‌ చేయాడానికి గట్టిగా ప్లాన్ చేశాడు అని. నేను వెంటనే అతనికి ‘నువ్వు నాకు ప్రపోజ్‌ చేయాలనుకుంటే ముందు నా తల్లిదండ్రుల పర్మిషన్‌ తీసుకోవాలి’ అని చెప్పా.

ఆ తర్వాత నేను-సిద్ధార్థ్‌ కలిసి వాళ్ల రిలేటివ్‌ ఇంటికి డిన్నర్‌‌కు వెళ్లాం. ఆ క్యాండిల్‌ లైట్‌ డిన్నర్‌ నాకు బాగా ఇబ్బందిగా అనిపించింది. వాకింగ్‌కు వెళ్దామని సిద్ధార్థ్‌ అనడంతో నేను కూడా ఓకే అన్నా. అలా మేమిద్దరం కాస్త దూరం వెళ్లగానే పొదల్లోంచి ఒక వ్యక్తి వయోలిన్‌తో మా వద్దకు వచ్చి ప్లే చేస్తూ ఉన్నాడు. వెంటనే సిద్ధార్థ్‌ మోకాళ్లపై కూర్చొని ‘షేర్షా’ మూవీలోని.. ‘ఢిల్లీ కా సీదా సాదా లుండా హు’ అంటూ డైలాగ్‌ చెప్పి తన ప్రేమను తెలిపాడు. కానీ అతను డైలాగ్‌ చెబుతుంటే నాకు నవ్వు ఆగలేదు. మా జీవితాల్లో ఎంతో విలువైన ఆ క్షణాలను సిద్ధార్థ్‌ బంధువు వీడియో తీశాడు. ఆ క్షణాన్ని నా లైఫ్‌లో మర్చిపోలేను’ అంటూ కియారా అందమైన జ్ఞాపకాలు గుర్తుచేసుకుంది.



Next Story

Most Viewed