మొదలైన తారకరత్న అంతిమయాత్ర.. శోకసంద్రంలో నందమూరి ఫ్యామిలీ

by Disha Web Desk 19 |
మొదలైన తారకరత్న అంతిమయాత్ర.. శోకసంద్రంలో నందమూరి ఫ్యామిలీ
X

దిశ, వెబ్‌డెస్క్: నటుడు నందమూరి తారకరత్న అంతిమయాత్ర ప్రారంభమైంది. ఫిలిం ఛాంబర్ నుండి మొదలైన అంతియాత్ర జూబ్లీహిల్స్ మహా ప్రస్థానం వరకు సాగనుంది. కాగా, అంతిమయాత్రలో నందమూరి, నారా కుటుంబ సభ్యులు పెద్దఎత్తున పాల్గొన్నారు. నందమూరి తారకరత్నను కడసారి చూసేందుకు అతడి అభిమానులు భారీగా అంతిమయాత్రలో పాల్గొంటున్నారు. అంతేకాకుండా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తారకరత్న అంతిమయాత్రలో పాల్గొన్నారు.

ఇదిలా ఉండగా.. తండ్రి పార్థివదేహాన్ని చూస్తూ తారకరత్న పిల్లలు బోరున విలపించారు. పిల్లలు ఏడ్చిన తీరు అక్కడికి వచ్చిన వారి అందరి చేత కన్నీళ్లు పెట్టించాయి. ఇక, కొడుకును కడసారి చూస్తూ తారకరత్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అభిమానులు, కుటుంబ సభ్యుల వీడ్కోలు మధ్య తారకరత్న అంతిమయాత్ర సాగుతోంది. కాసేపట్లో జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు జరగనున్నాయి.

Next Story

Most Viewed