జైలు నుంచి జాక్వెలిన్‌కు మరో ఘాటు ప్రేమ లేఖ రాసిన సుఖేష్ చంద్రశేఖర్

by Disha Web Desk 4 |
జైలు నుంచి జాక్వెలిన్‌కు మరో ఘాటు ప్రేమ లేఖ రాసిన సుఖేష్ చంద్రశేఖర్
X

దిశ, వెబ్‌డెస్క్ : నవరాత్రి వేళ కాన్‌మెన్ సుఖేష్ చంద్రశేఖర్ జాక్వెలిన్‌కు మరో ఘాటు ప్రేమ లేఖ రాశారు. నవరాత్రి తొమ్మిది రోజులు తాను ఉపవాసం ఉండనున్నట్లు లేఖలో సుఖేష్ తెలిపాడు. ‘బేబీ(జాక్వెలిన్) నువ్వు దోహా షోలో హాట్ అండ్ ప్రెట్టీగా ఉన్నావు. నీకన్నా మరెవరూ అందంగా లేరు. నవరాత్రి సందర్భంగా మన జీవితంలో అంతా మంచే జరగాలని నా జీవితంలో తొలిసారి ఉపవాసం ఉండాలని ఫిక్స్ అయ్యాను. దేవీ మాత దయతో అంతా మనకు అనుకూలంగానే జరుగుతుంది.

నిజం త్వరలోనే బయటకు వస్తుంది. మనమిద్దం త్వరలోనే ఒక్కటవుతాం. జీవితాంతం ఒకరితో ఒకరం కలిసి జీవిస్తాం మై బేబీ గర్ల్’ అంటూ లేఖలో సుఖేష్ రాసుకొచ్చాడు. ‘మా వైష్ణోదేవి, మహా కాళేశ్వర ఆలయంలో స్పెషల్ పూజ హారతి చేయాలని లేఖలో సుఖేష్ కోరాడు. లేఖలో చివరగా ఏ జైలు నిన్ను ప్రేమించడాన్ని ఆపలేవు. నీ కోసం చంపడానికి, చనిపోవడానికి నేను సిద్ధం అన్నారు. ఇక రూ. 200 కోట్లు మనీలాండరింగ్ కేసులో సుఖేష్ చంద్రశేఖర్ తిహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. సుఖేష్ చంద్రశేఖర్‌పై ఫోర్జరీతో పాటు మరికొన్ని కేసులు ఉన్నాయి.


Next Story