అభిమానులను పిలిచి మరీ భోజనాలు పెట్టించిన స్టార్ హీరో సూర్య .. కారణం ఇదే

by Dishafeatures1 |
అభిమానులను పిలిచి మరీ భోజనాలు పెట్టించిన స్టార్ హీరో సూర్య .. కారణం ఇదే
X

దిశ, సినిమా: తమిళ స్టార్ హీరో సూర్య గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఆయనకు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక మూవీస్ లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన కుటుంబానికి.. ఫ్యాన్స్‌కి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు సూర్య. ఈ క్రమంలో తాజాగా ఫోన్ చేసి మరి తన ఫ్యాన్స్‌ని పిలిపించి.. స్వయంగా దగ్గరుండి వడ్డించి మరి భోజనాలు పెట్టాడు సూర్య. మరి ఇంత సడెన్ సూర్య తన అభిమానులను పిలిచి మరి భోజనం ఎందుకు పెట్టరు అంటే..

గత ఏడాది డిసెంబర్ లో తమిళనాడును వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. మిచాంగ్ తుపాను కారణంగా అక్కడ పలు నగరాలు నీట మునిగాయి. వేలాది మంది ప్రజలు రోడ్డున పడ్డారు. దీంతో సూర్య, కార్తీలు వెంటనే రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించడమే కాకుండా తుపాను ప్రభావం తగ్గే వరకు.. ప్రభావిత ప్రాంతాల్లో నిత్యం అన్నదాన కార్యక్రమాలు కూడా చేపట్టారు. అయితే రోజు అన్నదాన కార్యక్రమాలు చేపట్టాలంటే భారీ సంఖ్యలో వర్కర్స్ కావాలి. దీంతో సూర్య తన అభిమానులకు పిలిస్తే .. వెంటనే రంగంలోకి దిగిన సూర్య ఫ్యాన్స్ వరద ప్రాంతాల్లో పలు సేవలు చేశారు.

అందుకే ఇప్పుడు సూర్య వారిని స్వయంగా ఫోన్ చేసి మరి ఆహ్వానించి ఒక గ్రాండ్‌ పార్టీ ఏర్పాటు చేశారు. చెన్నైలోని త్యాగరాయర్ నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్‌ హాలులో, చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్‌పట్టు జిల్లాల్లోని తన అభిమానులందరికీ శాఖాహార విందును ఏర్పాటు చేశారు సూర్య.అలాగే వారితో ఎంతో ఓపికగా ఫొటోలు కూడా దిగాడు. ప్రస్తుతం ఈ విందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

Next Story

Most Viewed