SSMB28: త్రివిక్రమ్ పై మహేష్ బాబు అభిమానులు ఫైర్.. ఎందుకో తెలుసా?

by Disha Web Desk 10 |
SSMB28: త్రివిక్రమ్ పై  మహేష్ బాబు అభిమానులు ఫైర్.. ఎందుకో  తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ డైరెక్టర్స్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఒకరు. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో అతడు, ఖలేజా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ అందుకునేందుకు మహేష్ తో SSMB 28 సినిమా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే మహేష్ అభిమానులు మాత్రం డైరెక్టర్ త్రివిక్రమ్ మీద ఒక రేంజులో మండి పడుతున్నారు. ఆ తరువాత డైరెక్టర్ త్రివిక్రమ్ సినిమా మరొకటి విడుదలవుతుంది. SSMB 28 ముందు అనుకున్న కథ ఒకటి.. ఆ కథ మహేష్ బాబుకు నచ్చక పోవడంతో మరో స్టోరీ రెడీ చేశారు త్రివిక్రమ్. చాలా లాంగ్ గ్యాప్ తరవాత ఈ సినిమా రీ స్టార్ట్ అయ్యింది.

ఈ షూటింగ్ కోసం మహేష్ 60 రోజులు డేట్స్ కూడా ఫిక్స్ అయ్యాయట. కానీ త్రివిక్రమ్ మాత్రం మరో సినిమా మీద ఫోకస్ పెట్టాడు. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా కథను మారుస్తూ కొత్త కథను సిద్ధం చేసే పనిలో ఉన్నాడట. అంతే కాకుండా ఈ సినిమాలో పాటలు, ఫైట్స్ ఉండేలా కథను తీర్చిదిద్దాడట. ఈ సినిమాకు బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ రాశారట. ఈ రీమేక్ సినిమాకు స్క్రిప్ట్ రెడీ చేసిన త్రివ్రిక్రమ్ బుర్రా సాయి మాధవ్ రాసిన డైలాగ్స్ ను కూడా తనదైన స్టైల్లో రాశాడట. ఒక వైపు SSMB 28 సినిమాకు షూటింగ్ చేస్తూ .. ఇంకో వైపు పవన్ కళ్యాణ్ సినిమా పై ఫోకస్ పెట్టేసరికి మహేష్ అభిమానులు కంగారు పడుతున్నారు.

Next Story

Most Viewed