ముంబైలో లగ్జరీ అపార్ట్‌మెంట్‌ కొనుకున్న సోనమ్..ఎన్ని కోట్లో తెలుసా?

by Disha Web Desk 10 |
ముంబైలో లగ్జరీ అపార్ట్‌మెంట్‌ కొనుకున్న సోనమ్..ఎన్ని కోట్లో తెలుసా?
X

దిశ, సినిమా : సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న స్టార్ హీరోలు, వారి వారసులను కూడా ఇండస్ట్రీలోకి తీసుకువస్తున్నారు. అయితే ఎక్కువగా బాలీవుడ్ ఇండస్ట్రీలో సినీ తారల పిల్లలు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అందులో సోనమ్ కపూర్ ఒకరు. మంచి మూవీస్‌ను ఎంచుకుంటూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సోనమ్‌ కపూర్‌ మూడేళ్లపాటు వెండితెరకు దూరంగా ఉంది. వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయిస్తూ వచ్చింది. 2019లో " ద జోయా ఫ్యాక్టర్‌ " అనే చిత్రంలో నటించిన సోనమ్ ఆ తర్వాత ఏ ప్రాజెక్ట్‌ ఎంచుకోలేదు. ఇక రిసెంట్‌గా ఆమె ముంబైలోని సిగ్నేచర్ ఐలాండ్‌లో లగ్జరీ అపార్ట్‌మెంట్‌ తీసుకుంది. దీని ఖరీదు సుమారు రూ.32 కోట్లు అని తెలిసింది. మొత్తం నాలుగు కార్ పార్కింగ్ స్లాట్‌లతో కూడిన మూడవ అంతస్తులో ఫ్లాట్ ఉంది.

Read More...
అనారోగ్యంతో బాధపడుతున్న 'బిగ్‌బాస్' బ్యూటీ!

Next Story