విక్రమ్‌ ఫ్యాన్స్‌కు సాలిడ్ అప్‌డేట్.. ‘కేజీఎఫ్‌’ లింక్‌తో చియాన్ కొత్త సినిమా

by Disha Web Desk 6 |
విక్రమ్‌ ఫ్యాన్స్‌కు సాలిడ్ అప్‌డేట్.. ‘కేజీఎఫ్‌’ లింక్‌తో చియాన్ కొత్త సినిమా
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్‌ అప్ కమింగ్ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ క్రేజీ అప్ డేట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం ‘తంగలాన్‌’ సినిమాతో బిజీగా ఉన్న విక్రమ్.. మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు డైరెక్టర్ ఎస్‌.యూ అరుణ్‌ కుమార్‌ నెక్ట్స్ ప్రాజెక్టులో విక్రమ్‌ హీరోగా నటించబోతున్నాడని సమాచారం.

అయితే ఈ మూవీ కూడా ‘తంగలాన్’ మాదిరిగానే బ్రిటీష్ ఇండియా కాలం నాటి వాస్తవ ఘటనల నేపథ్యంలో ఉండనుందని, కోలార్ గోల్డ్‌ ఫీల్డ్‌ (కేజీఎఫ్‌) కనెక్టివిటీతోనే ఈ స్టోరీ తెరకెక్కబోతుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ‘ప్రస్తుతం విక్రమ్‌-అరుణ్‌ కుమార్‌ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ ఫార్మాలిటీస్‌ కొనసాగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటనతోపాటు మరిన్ని వివరాలపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు’ అని విక్రమ్ సన్నిహితులు చెప్పినట్లు పలు నివేదికలు వెల్లడించాయి.

ఇవి కూడా చదవండి : మొదలైన ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ షూటింగ్.. ఆదాశర్మ పోస్ట్ వైరల్

Next Story

Most Viewed