‘స్త్రీ’కి ఐదేళ్లు.. గతాన్ని తలుచుకుంటూ ఎగ్జయిట్ అయిన శ్రద్ధ

by Disha Web Desk 6 |
‘స్త్రీ’కి ఐదేళ్లు.. గతాన్ని తలుచుకుంటూ ఎగ్జయిట్ అయిన శ్రద్ధ
X

దిశ, సినిమా : ఈ యేడాదితో ‘స్త్రీ’ సినిమా 5 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా తన పాత్రను, మూవీని గొప్పగా ఆదరించిన అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది శ్రద్ధా కపూర్. 2018 ఆగస్టు 31న రిలీజైన హారర్ కామెడీని అమర్ కౌశిక్ తెరకెక్కించగా రాజ్ కుమార్ రావ్, శ్రద్ధ ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే రీసెంట్‌గా ఓ సమావేశంలో పాల్గొన్న నటి మూవీ విజయాన్ని తలచుకుంటూ.. ‘‘స్త్రీ’ విడుదలై ఐదేళ్లు పూర్తి చేసుకున్నందుకు చాలా థ్రిల్‌గా ఉంది. ఈ చిత్రం నా హృదయంలో చాలా ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటుంది.

దీనిని ఎల్లప్పుడూ ప్రేమగా గుర్తుంచుకుంటాను. స్క్రిప్ట్ విన్న క్షణంలోనే ఈ ప్రాజెక్ట్ లో భాగం కావాలని ఫిక్స్ అయ్యా. సామాజిక సందేశాలతో వినోదభరితమైన చిత్రాన్ని రూపొందించడం నార్మల్ ఫీట్ కాదు. దినేష్, అమర్, రాజ్ & డీకే ఘన విజయాన్ని కైవసం చేసుకోవడం గొప్పగా అనిపించింది. దీనిపట్ల అపారమైన ప్రేమ కలిగివున్న ప్రేక్షకులు ‘స్త్రీ 2’ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నందుకు స్పెషల్ థాంక్స్’ అని ఎగ్జయిట్ అయింది. ఇక ఇటీవల ముంబైలో జరిగిన ఒక ఈవెంట్‌లో సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్ ఇందుకు సంబంధించి ఒక స్కిట్‌ను చూపించడంతోపాటు 2024 ఆగస్టులో థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు.



Next Story

Most Viewed