Rakhi Sawant పై కేసు నమోదు.. మీటూ బాధితులే టార్గెట్

by Disha Web Desk 6 |
Rakhi Sawant పై కేసు నమోదు.. మీటూ బాధితులే టార్గెట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ బాంబ్స్ షెర్లిన్ చోప్రా, రాఖీ సావంత్ కాంట్రవర్సీ క్రియేట్ చేయడంలో ముందుంటారన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య మరో వివాదం తలెత్తింది. మీటూ నిందితుడు సాజిద్ ఖాన్ తనను లైంగికంగా వేధించాడని, అతడిని బీబీ16 నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది షెర్లిన్. దీనిపై స్పందించిన రాఖీ.. మీడియా ముందు ఏడుస్తూ డ్రామాలాడుతుందని, షెర్లిన్‌ కనిపిస్తే కొట్టి, చంపేయాలని ఉందని, సాజిద్‌కు సపోర్ట్‌గా కామెంట్స్ చేసింది. దీంతో రాఖీ వల్ల ప్రాణ భయముందని జుహు పోలీస్ స్టేషన్‌లో కంప్లయింట్ చేయగా.. ఐపీసీ 499, 500, 509,503 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపింది షెర్లిన్. అంతేకాదు రాఖీ సావంత్‌తో సహా పలువురు ఇండస్ట్రీ టమ్మీస్.. మీటూ బాధితులను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించింది.


Next Story

Most Viewed