Liger సినిమాపై కొనసాగుతున్న ఈడీ విచారణ.. వెలుగులోకి సంచలన విషయాలు

by Disha Web Desk 7 |
Liger సినిమాపై కొనసాగుతున్న ఈడీ విచారణ.. వెలుగులోకి సంచలన విషయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నో అంచనాల నడుమ 'లైగర్' సినిమా రిలీజై డిజాస్టర్‌గా నిలిచింది. కాగా.. ఈ సినిమా పెట్టుబులపై ఈడీ (ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) అధికారులు విచారణలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మొన్నటికి మొన్న పూరీ జగన్నాథ్, చార్మిని ఈడీ అధికారులు సుమారు 12 గంటల పాటు విచారించారు. ఇక తాజాగా సినిమా హీరో విజయ్ దేవరకొండను కూడా ఈడీ విచారించింది. పూరీ జగన్నాథ్ కనెక్ట్‌కి ఎల్‌ఎల్‌పి కి 30 నుంచి 40 కోట్ల రూపాయల నగదు బదిలీపై ఈడీ ఫోకస్ పెట్టింది. 100 బిపాయీ అకౌంట్ల నుంచి ట్రాన్స్‌ఫర్ అయిన ట్లు ప్రాధమికంగా గుర్తించిన అధికారులు.. ఈ సినిమాకు 10 కోట్ల పెట్టుబడులు విదేశాల నుంచి వచ్చినట్లు గుర్తించారు. అంతేకాకుండా.. ఈ సినిమా పెట్టుబడులకు, రాజకీయ నేతలకు ఏమైనా సంబంధాలు ఉన్నాయేమో అనే కోణంలో ఈడీ విచారణ కొనసాగిస్తుంది.


Also Read.......

'హిట్-3' లో సమంత..! అడివి శేష్ రియాక్షన్ ఇదే



Next Story

Most Viewed