'టైగర్ 3' నుంచి బిగ్ అప్‌డేట్.. నిరాశలో ఫ్యాన్స్

by Disha Web Desk 7 |
టైగర్ 3 నుంచి బిగ్ అప్‌డేట్.. నిరాశలో ఫ్యాన్స్
X

దిశ, సినిమా : సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా వస్తున్న 'టైగర్ 3' నుంచి మరో అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. నిజానికి 2023 ఈద్‌కు ప్రేక్షకుల ముందుకు వస్తుందనుకున్న చిత్రం మరింత ఆలస్యంగా విడుదల కాబోతుందంటూ అధికారికంగా తెలిపిన చిత్ర బృందం.. వచ్చే ఏడాది ఏప్రిల్ 21న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ట్విట్టర్ వేదికగా పంచుకున్న సల్మాన్ ఖాన్.. 'టైగర్‌కు కొత్త తేది వచ్చింది. దీపావళి 2023. మీకు సమీపంలో ఉన్న పెద్ద స్క్రీన్‌లో మాత్రమే. హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల చేస్తున్నాం' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. మనీష్ శర్మ దర్శకత్వంలో అదిత్య చోప్రా నిర్మించిన సినిమాలో షారుఖ్ ఖాన్ అతిధి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.

Next Story

Most Viewed