Saindhav : క్షుద్రపూజలు, చేతబడి నేపథ్యంతో వస్తున్న 'సైంధవ్'

by Disha Web Desk 1 |
Saindhav : క్షుద్రపూజలు, చేతబడి నేపథ్యంతో వస్తున్న సైంధవ్
X

దిశ, వెబ్ డెస్క్ : హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా 'సైంధవ్'. త్వరలో రానున్న ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలున్నాయి. విక్టరీ వెంకటేశ్ 75వ చిత్రంగా అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ వారు పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిస్తున్నారు. సంతోష్ నారాయణ్ బాణీలు అందిస్తున్నారు. కాగా, ఈ సినిమాలో వెంకీకి జోడీగా కన్నడ భామ శ్రద్ధ శ్రీనాథ్ ఫైనల్ అయ్యింది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా నుండి తాజాగా అదిరిపోయే అప్డేట్ కూడా వచ్చింది.

ఈ సినిమా స్టోరీ గురించి తాజాగా ఒక అంశం బాగా వైరల్ అవుతుంది. శైలేష్ కొలను ఒక సినిమాను తెరకెక్కించాలి అంటే ఎంత రీసెర్చ్ చేస్తారో హిట్ సినిమాతోనే రుజువు చేసుకున్నాడు. అందుకే ఈ సినిమా స్టోరీపై మరింత ఇంట్రెస్ట్ కలుగుతుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్ అని చేతబడి, క్షుద్రపూజల అంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అది కూడా రియల్ స్టోరీతో అని తెలుస్తుంది. మన దేశంలో కర్ణాటక రాష్ట్రంలో బ్లాక్ మ్యాజిక్ యాక్ట్ అమలులో అయితే ఉంది.

ఎందుకు అంటే కర్ణాటకలో విపరీతమైన మారణహోమం సంభవించినప్పుడు ఈ యాక్ట్ ను అక్కడి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటికి ఈ చట్టం అమలులో ఉందని సమాచారం. చనిపోయిన వారికీ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఎలాంటి అధరాలు దొరకపోవడం అప్పట్లో చర్చనీయాంశం కాగా, ఎన్నో కేసులు కూడా నమోదయ్యాయి. నేటికీ అక్కడ బ్లాక్ మ్యాజిక్ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయని మరి ఇదే కథాంశంతో శైలేష్ సినిమా తీస్తుండగా ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి మరి.


‘ఆదిపురుష్’ నుంచి ‘రామ్ సీతారాం’ సాంగ్ రిలీజ్

Read more:

ఇంతకు ముందు ఎప్పుడు షేర్ చేయలేదు నాకే ఆశ్చర్యంగా ఉంది: ఉపాసన పోస్ట్



Next Story

Most Viewed